GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు స్థిరంగా కొనసాగాయి. క్వింటా పసుపు గరిష్ఠ ధర రూ.11,200 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రకాల వారీగా చూస్తే.. పసుపు కొమ్ములు రూ.9,950 నుంచి రూ.11,200 వరకు, అలాగే కాయ రకం పసుపు రూ.10,950 నుంచి రూ.11,025 వరకు పలికినట్లు వెల్లడించారు.