W.G: రబీ పంట కొనుగోలుకు ప్రభుత్వం కొత్త గోనెసంచులు ఇవ్వాలని, గత ఖరీఫ్ పంటకు రైతాంగానికి రావల్సిన రూ.15 కోట్లపై బడి రవాణా వాహన ఛార్జీలు వెంటనే ఇవ్వాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మార్టేరులో గురువారం జిల్లా కమిటీ సమావేశాన్ని అధ్యక్షుడు శ్రీనివాసరావు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే చిరిగిన గోనె సంచులతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు.