CTR: తవణంపల్లి మండలంలో ఎంపీపీ ఎన్నిక ఎలాంటి పోటీ లేకుండా గురువారం ఏకగ్రీవంగా ముగిసింది. మొత్తం 15 ఎంపీటీసీ సభ్యులలో 14 మంది వైసీపీకి చెందినవారు, ఒకరు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. వైసీపీ సభ్యుల సంపూర్ణ మద్దతుతో పట్నం ప్రతాప్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు.