E.G: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం విజ్ఞప్తి చేశారు. తుఫాన్ కారణంగా గాదరాడలోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన వాతావరణ హెచ్చరికలు గమనించాలన్నారు.