KMR: లింగంపేట్ మండలం పరమల్ల గ్రామానికి చెందిన రమావత్ లింబ, రమావత్ రమేష్, రమావత్ పరమేశులు నాగిరెడ్డిపేట మండలానికి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా కానిస్టేబుళ్లు సందీప్, గంగారం వారిని సోమవారం రాత్రి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.