KRNL: శ్రీ సోమవంశ సహస్రార్జున మహారాజ్ జయంతిని సోమవంశ క్షత్రియులు ఖత్రి ఇవాళ జిల్లాలొ ఘనంగా జరుపుకున్నారు. పాతనగరంలోని అంబాభవాని దేవాలయంలో ఖత్రి సమాజం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. మహిష్మతి రాజ్యంపై పరాక్రమశాలి, ధార్మిక రాజుగా కీర్తింపబడిన ఆయనను స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు.