CTR: వీకోట మండలం మద్దిమకుల పల్లెలో యువకుడిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శరత్(25) పొలాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఆవులను మేపడానికి వెళ్లగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాల పాలైయ్యాడు. ఈ మేరకు యువకుడిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.