ప్రొ కబడ్డీ సీజన్-12లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. క్వాలిఫయర్-2లో పుణేరీ పల్టాన్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 50-45 పాయింట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెకెండ్ హాఫ్లో డిఫెన్స్లో చేసిన అనవసరపు తప్పిదాల కారణంగా టైటాన్స్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఫైనల్లో పుణేరీ పల్టాన్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.