CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని అన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రాణరక్షణకు అవసరమని సూచించారు. ISI నాణ్యమైన హెల్మెట్లు మాత్రమే వాడాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.