NDL: బండిఆత్మకూరు మండలం సంతజూటూరులో సోమవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ పద్మావతమ్మ ఆద్వర్యంలో చేపట్టారు. గ్రామంలో మొత్తం 865 పాసుపుస్తకాలు ఉండగా, అర్హులైన 648 మంది రైతులకు అందజేశామని తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.