కోనసీమ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల వారికి కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.