AKP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 28న రాంబిల్లి మండలం సీతపాలెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతం, భద్రత ట్రాఫిక్ తదితర విషయాలపై చర్చించారు. బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవానికి లోకేష్ ముఖ్యఅతిథిగా వస్తున్న విషయం తెలిసిందే.తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.