NZB: సిరికొండ మండలం పందిమడుగు రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. గత నెలలలో గుంతలో పడి ముగ్గురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మరమ్మతులు చేయాలని (ఆర్అండ్ బి) అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డును మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.