RR: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని వందలాది చికెన్ దుకాణాలను బంద్ చేశారు. అయితే పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.