TPT: తడ రైల్వే స్టేషన్ ఉత్తర వైపున బుధవారం పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని 65–70 ఏళ్ల వృద్ధుడిని రైలు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నై-సూళ్లూరుపేట లోకల్ ట్రైన్ సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.