భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 7నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల కోసం సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 16 కేటగిరీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సదరం క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 7,8,10, 15,17,21,24,28 తేదీలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.