తిరుపతిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మందిపై కేసులు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ధనలక్ష్మి విచారణ జరిపి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.3లక్షల జరిమానా విధించారు.