TPT: వెంకటగిరి-గూడూరు మార్గంలో నిడిగల్లు రైల్వే స్టేషన్లో సోమవారం అర్ధరాత్రి ఓ రైలు ఆగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు చైను దొంగలించాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వెందోడు-రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య దొంగను గుర్తించి అతడిని విచారించే సమయంలో రైలు నుంచి దూకేయడంతో చనిపోయాడు.