MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందాలని ఇన్ఛార్జ్ కమిషనర్ గణేష్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ప్రకటించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆస్తి పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.