NGKL: లింగాల మండలం సలేశ్వర కొండగుహల్లో పాండవులు వనవాసం చేసిన క్షేత్రమే ఇప్పటి సలేశ్వరం. సలేశ్వర గుహల్లో పాండవులు బస చేసినట్టు స్థల పురాణం చెబుతుంది. ఇదే ప్రాంతంలో శివపార్వతులు తపస్సు చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. సలేశ్వరం క్షేత్రాన్ని పూర్వకాలంలో శైలపురంగా పిలిచేవారని స్థానికులు చెబుతారు. దేవాలయంలో చెంచులు పూజారులుగా వ్యవహరిస్తారు.