CTR: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.5 లక్షల విలువ చేసే 24 సంచుల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు గుడిపాల పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి పశుమంద క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుంచి తమిళనాడుకు పొగాకు ఉత్పత్తులు ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.