NDL: ప్యాపిలి మండలం కొమ్మమరి రెవెన్యూలో భూముల రీ సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి సర్వే ప్రారంభమవుతుందని ఎమ్ఆర్వో భారతి తెలిపారు. రీ సర్వే ద్వారా భూముల హద్దులు స్పష్టతతో పాటు రికార్డులు సక్రమంగా నమోదు అవుతాయని పేర్కొన్నారు. సర్వే టీమ్ రాకపై ముందుగానే రైతులకు నోటీసుల ద్వారా సమాచారం ఇస్తామని వెల్లడించారు.