SDPT: యాసంగి పంట కాలం పూర్తయ్యే వరకు పంటలకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి మరొ 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ అందజేశారు. ఇప్పటికే 2.4 టీఎంసీలు పంపింగ్ కాగా, ఇంకా నీటి అవసరం ఉందని తెలిపారు.