సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కాలనీల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. రెవిన్యూ, పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై పౌర హక్కులు, సామాజిక న్యాయంపై అవగాహన కల్పించారు. చట్టపరమైన రక్షణలు, సమానత్వ హక్కు ప్రాముఖ్యతను వివరించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.