కోనసీమ: జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ విశేష కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం డ్రగ్స్ నిరోధక కమిటీ సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.