MBNR: మహబూబ్ నగర్ మండలం ధర్మపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎల్ఎస్ సర్వేను జిల్లా విద్యా శాఖాధికారి ప్రవీణ్ మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాల అంచనాకు ఈ సర్వే కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, డైట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.