PDL: నకరికల్లు (మం) గుండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవల్ల కోటేశ్వరరావు ఇటీవలె మృతి చెందారు. ఆయన కుటుంబానికి రూ. 5. లక్షల చెక్కును మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. కోటేశ్వరరావుకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో మంజూరైన రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లుగా కన్నా పేర్కొన్నారు.