PLD: ఈపూరు మండలం పొనుగోటివారిపాలెం గ్రామంలో మంగళవారం రెండో రోజు కూడా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల కలిగిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఏమైనా వ్యాధులతో బాధపడుతున్నారా ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.