శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓగా రావాడ వెంకట్రామన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ డిప్యూటీ సీఈఓగా ఉన్న ఆయన, గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో విజిలెన్స్ అధికారిగా, డిఆర్డిఏ, ఎంపీడీవోగా పనిచేశారు. ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారని ఆఫీస్ వర్గాలు తెలిపాయి.