VSP: ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని జిల్లా వృత్తివిద్యశాఖాధికారిణి పి.ఉమారాణి తెలిపారు. విద్యార్థులు తరగతులకు సకాలంలో హాజరవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలను తరగతులకు పంపాలని కోరారు.