SDPT: సిద్ధిపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అరుణ, జనరల్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.