NGKL: పట్టణ బస్టాండ్ ఆవరణలో ఓ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డీపో డీఎం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాదం రమేష్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.