AP: అమరావతి రాజధానిపై త్వరలోనే చట్టం వస్తోందని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘చట్టం వచ్చాక రాజధానిని ఎవరూ కదిలించలేరు. HYD, చెన్నై కంటే మెరుగ్గా అమరావతి అభివృద్ధి జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించి పథకాలు అమలు చేస్తాం. పెన్షన్ పంపిణీని రియల్టైమ్ మానిటర్ చేస్తున్నాం. పనిచేయని అధికారులతో పనిచేయించడం నా బాధ్యత. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి’ అని హెచ్చరించారు.