ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలం దృష్ట్యా వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశామని సిబ్బంది తెలిపారు. నీటిని వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.