RR: కొందుర్గు మండలం పర్వతాపూర్లో మహాత్మా జ్యోతిబా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య వంటి విలువలను స్థాపించడంలో ఫులే, అంబేద్కర్ పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.