KRNL: ఎమ్మిగనూరులో కెనరా బ్యాంక్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.6.80 లక్షల విలువైన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సిబ్బంది సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.