MNCL: జైపూర్ మండలం నుంచి కోటపల్లికి ఎండలో ప్రయాణించిన పార్వతి (63) అనే వృద్దురాలు వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ షాహాభాజ్, పైలట్ సిరాజోద్దీన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు బాధితురాలికి ప్రథమ చికిత్స అందిస్తూ చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది.