TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇవాళ, రేపు తిరుమల-తిరుపతి పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు పేర్కొన్నారు. అధికారులతో సమావేశం నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.