MLG: తాడ్వాయి(మం) కామారం క్రాస్ వద్ద సోమవారం, అతివేగంతో దూసుకొచ్చిన ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఏటూరునాగారం(మం) రామన్న గూడెం స్థానిక నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై నవీన్ మృతదేహం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.