KMM: కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పతనంతిట్ట జిల్లా లోని ఎమ్మెల్యే అభ్యర్థి శాంత కుమార్కు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వివిధ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు.