SRPT: పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బ్యాంక్వెట్ హాల్లో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కౌన్సిలర్లు పనిచేయాలని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత అన్నారు.