IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇవాళ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. KKRతో జరగబోయే మ్యాచ్తో ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు MI మొత్తం 299 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో IPLలో 277 మ్యాచ్లు, ఛాంపియన్స్ లీగ్ T20లో 22 మ్యాచ్లు ఆడింది.