SRCL: జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి స్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలవేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. టిడిపి హయంలో చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.