MDK: రామాయంపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మండల తహశీల్దార్ రజనీకుమారి స్పష్టం చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్యాస్ పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా కమీషన్ల కోసం వినియోగదారులను ఇబ్బంది పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.