KMM: జిల్లా కోర్టుతో పాటు సత్తుపల్లి, మధిర కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 6,500 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయ సేవాధికారీ M.కల్పన తెలిపారు. ఈ కేసుల్లో సివిల్ కేసులు 2,730, సివిల్ కేసులు 37, చెక్ బౌన్స్ కేసులు 48, కుటుంబ తగాదా కేసులు 10, మోటారు ప్రమాద కేసులు 85, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 3,544, లిటిగేషన్ కేసులు 46 ఉన్నాయన్నారు.