BHNG: గుండాల మండలం మాసాన్పల్లికి చెందిన బత్తిని హరీష్ గౌడ్ (24) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ఉప్పల్లో నివసించే హరీశ్ అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం లభించింది. విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.