BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి శనివారం ఒక్కరోజే రూ. 21,98,308 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ప్రసాద విక్రయాలకు రూ. 8,07,150 రాగా, కార్ పార్కింగ్ రూ. 2,82,500, VIP దర్శనాల ద్వారా రూ. 2,25,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు. అలాగే బ్రేక్ దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవల విభాగాల నుంచి భారీగా నిధులు సమకూరాయని అధికారులు తెలిపారు.