KKD: అనాథ పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్కెఆర్ మహిళ కళాశాల ఎదురుగా రూ.78 లక్షలతో చేపట్టనున్న సదనం చిల్డ్రన్ హోమ్ నూతన భవన నిర్మాణానికి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. చిల్డ్రన్ హోమ్ సామర్థ్యం పెరిగి మరింత మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందన్నారు.