HNK: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ను నవతెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం అందజేశారు. హనుమకొండ జిల్లాలో దివ్యాంగులకు కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుని దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి. అజీమ్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.