PDPL: జిల్లాలో పదో తరగతి గణితం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.శారద తెలిపారు. మొత్తం 7,495 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,486 మంది పరీక్ష రాయగా, 9 మంది గైర్హాజరయ్యారు. 99.9 శాతం హాజరు నమోదవడం గమనార్హమని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.